ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంగారెడ్డి మున్సిపాలిటీలో 'పట్టణ ప్రగతి' కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2020, 04:59 PM

హైదరాబాద్‌ : పట్టణాల రూపు రేఖలు మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టణ ప్రగతి ప్రారంభించారని ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావుఅన్నారు. దశల వారీగా మున్సిపాలిటీల రూపురేఖలు మార్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం పట్ణణ ప్రగతిలో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలోని నారాయణరెడ్డి కాలనీని సందర్శించారు. వీధి దీధి తిరుగుతూ కాలనీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలను చెత్తబండీ వస్తుందా? అని వాకబుచేశారు. రోజువిడిచి రోజు వస్తోందని మహిళలు వివరించారు. వెంటనే మంత్రి హరీశ్‌రావు మున్సిపల్‌కమిషనర్‌ను పిలిచి చెత్తసేకరణ ఎలా జరుగుతోందని ప్రశ్నించారు. కాలనీలో కరెంట్‌ సమస్యలు ప్రస్తావించడంతో మంత్రి వెంటనే విద్యుత్‌శాఖ అధికారులను పిలిచి కాలనీవాసుల ముందే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. మరి కొందరు రేషన్‌షాపుడీలర్‌ సరిగ్గా సరుకులు ఇవ్వడం లేదని మంత్రి దృష్టికి ఫిర్యాదు  చేశారు. తమను ఇష్టారీతిన దూషిస్తూ మాట్లాడుతున్నారరని చెప్పడంతో మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలో దాదాపు పది రోజులపాటు రేషన్‌సరఫరా చేయాలని ఆ సమయాన్ని తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఎమ్మార్వోను ఆదేశించారు. వెంటనే రేషన్‌ సరుకులు ఎందుకు సకాలంలో ఇవ్వడం లేదో పరిశీలించారు. ఈసందర్బంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కొత్త మున్సిపల్‌ చట్టం ప్రజలకు హక్కులను, బాధ్యతలను అప్పగించింది. పారదర్శకత, జవాబుదారీతనం కోసం చట్టాన్ని రూపుదిద్దినట్టుచెప్పారు. ఒకప్పుడు ఇంటి అనుమతులు రావాలన్నా, పేదలు ఇళ్లుకట్టుకోవాలన్నా ఇబ్బందులుఉండేవని అన్నారు. కానీ ప్రస్తుతం చట్టంలో చేసిన సవరణల వల్ల ప్రజలకు మేలు కలుగుతోందన్నారు. ప్రజల్లో మార్పురావాలంటే చట్టం పట్ల భయం ఉండాలనన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com