పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రామంతపూర్లో నేషనల్ సైబర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం కిషన్రెడ్డి మాట్లాడారు. సైబర్ నేరాల పరిశోధనకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఆధునిక సాంకేతికతతో ఉత్తమ సెంటర్గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.