నల్గొండ జిల్లా పీఏపల్లి(మం) దుగ్యాల వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. ఏఎంఆర్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతి చెందినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఓ బాలుడి ప్రాణాలను స్థానికులు కాపాడారు. కాల్వలోనుంచి కారుతో సహా మూడు మృతిదేహాలను వెలికితీశారు. మృతులు రంగయ్య (54), అలివేలు (38), కీర్తీ (13) గా గుర్తించారు. వీరంతా పీఏపల్లి(మం)వడ్డేరిగూడానికి చెందినవారుగా గుర్తించారు.