రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న నిరుపేదలందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. గురువారం వరంగల్ అర్భన్ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట గ్రామంలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్నిమంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్లకార్డు కలిగిన పేదలకు ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీని చేపట్టిందని తెలిపారు. పనులకు పోలేని స్థితిలో ఉన్న పేదలకు త్వరలో నే రూ.1500 అందచేస్తార ని చెప్పారు.