కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్రజలు మరింత అప్రమత్తం కావాలని, అధికార యంత్రాంగానికి సహకరించాలని తెలంగాణా ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరిధిలో రోజు వారి కూలీలు లాక్ డౌన్ కారణంగా పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చిలకలగూడ, పార్సిగుట్ట, వారసిగూడ, లాలపేట్ తదితర ప్రాంతాల్లో ఉచిత మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు.. కార్పొరేటర్లు కుమారి సామల హేమ, ధనజన బాయి గౌడ్, శ్రీమతిఅలకుంట సరస్వతి లతో పాటు ఉప కమిషనర్ రవికుమార్, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారితో జరిగే యుద్ధంలో ప్రజల సహకారం అవసరమన్నారు.