ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెన్షనర్ల జీతాల్లో కోత విధించవద్దని సీఎంకి విజ్ఞాప్తి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 01, 2020, 02:00 PM

పెన్షనర్ల జీతాల్లో కోత విధించవద్దని మంగళవారం సీఎం కేసీఆర్ కి ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు విజ్ఞాప్తి చేశారు. కోవిడ్-19 వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే చర్యలో భాగంగా పెన్షనర్ల జీతాల్లో కోత విధించాలనుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 30, 40 ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసి, ఈరోజు కేవలం పెన్షన్ మీదనే ఆధారపడి జీవనం గడుపుతున్న వృద్ధులకు తీవ్రమైన మానసిక క్షోభ కలిగించడంతో పాటు కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితి ఏర్పడుతుందని అన్నారు. చాలా మంది రిటైర్డు ఉద్యోగులు ఒకవైపు సొంత ఇల్లు లేక కిరాయి ఇళ్లలో మగ్గుతూ.. మరోవైపు రోగాలతో నానా ఇబ్బందులకు గురవుతూ, వచ్చే పింఛన్లు సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com