ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్యులపై దాడులు చేస్తే కఠిన చర్యలు : మంత్రి తలసాని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 02, 2020, 02:58 PM

 వైద్యులపై ఎవరైనా దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంత్రి నేడు నగరంలోని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. దాడి ఘటనపై వైద్యులతో మాట్లాడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... వైద్యులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. గాంధీ ఆస్పత్రి వైద్యులకు భరోసా కల్పించినట్లు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా పికెట్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దన్నారు. 


గాంధీ ఆస్పత్రి పరిసర ప్రాంతాల యాచకులను తరలించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారందరిని దాదాపు గుర్తించినట్లు చెప్పారు. ఇంకా ఎవరైనా ఉంటే ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అంతకుక్రితం ఆదర్శనగర్‌లో పేదలకు మంత్రి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. రేషన్‌ కార్డులు లేని పేదలకు సరుకులను పంపిణీ చేశారు. విపత్కర పరిస్థితుల్లో చాలామంది దాతలు ముందుకొస్తున్నారన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com