కరోనా బాధితుల సహాయార్థం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రగతి నగర్ కు చెందిన శ్రీనివాస స్టీల్ & సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి లక్ష రూపాయాలను సీఎం సహాయనిధికి విరాళంగా అందించారు. ఈ రోజు ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే వివేకానంద్ ని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి చెక్కును ఇచ్చారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులను ఆదుకోవాలనే మంచి ఆలోచనతో దాతలు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. ఎంతో ప్రమాదకరంగా భావించే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ లాక్ డౌన్ ను పాటించాలని తెలిపారు.