లాక్ డౌన్ నేపథ్యంలో దర్జాగా పట్టా పగలు రెవెన్యూ అధికారులు మందు కొడుతున్నారు. దర్జాగా మెడలో ఐడెంటిటీ కార్డులు వేసుకొని మందేసి చిందేస్తున్నారు. ఇది ఎక్కడో మారుమూల నగరంలో కాదు సాక్షత్తూ హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని గంగన్నగూడ, చేరుకుపల్లి, విశ్వనాథ్ పూర్ గ్రామాలకు చెందిన వీఆర్వో, కృష్ణ, వీఆర్ఏ జంగయ్యతో పాటు మరో ఇద్దరు అధికారులు పట్ట పగలే విధుల్లో ఉన్న సమయంలో మందు వేయడంపై ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కరోనా వ్యాధితో రాష్ట్రమంతా అతలాకూతలం అవుతూంటే అధికారుల ప్రవర్తించిన తీరు వివాదంగా మారింది. కరోనా నివారణకు ప్రతి గ్రామానికి వీఆర్వో, వీఆర్ఏ, పంచాయితీ కార్యదర్శిలను నియమించారు. గ్రామంలో ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వస్తే రైళ్లలో వివిధ వాహనాల్లో వస్తే వారి సమాచారం ఎప్పటికప్పుడు ఆయా మండలలా తహసీల్దార్లకు తెలియజేయాలి. అదే విధంగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీ చేసే రేషన్ షాపుల ముందు వీరికి డ్యూటీలు వేశారు.