ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన బంగారం, వెండి ధరలు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 09, 2020, 09:19 PM

బంగారం, వెండి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి ధర పెరగడం గమనార్హం. కేజీ వెండి ధర ఏకంగా రూ.920 పరుగులు పెట్టింది. దీంతో వెండి ధర రూ.41,280కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.310 పెరుగుదలతో రూ.42,270కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.360 పెరుగుదలతో రూ.44,620కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.920 పెరిగింది. దీంతో ధర రూ.41,280కు చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.130 పెరుగుదలతో రూ.40,160కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.130 పెరుగుదలతో10 గ్రాములకు రూ.44,160కు ఎగసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.70 శాతం దిగొచ్చింది. దీంతో బంగారం ధర 1700 డాలర్ల కిందకు వచ్చేసింది. 1672 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 2.05 శాతం తగ్గుదలతో 15.16 డాలర్లకు క్షీణించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com