యువకుని వేధింపులకు ఓ మహిళ బలైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాల్టీ పరిధిలో ఉన్న కరకవాగు గేట్ తండాకు చెందిన మహిళ స్నానం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన మధు అనే యువకుడు వీడియో తీశాడు. ఆ వీడియోను చూపించి కొంత కాలంగా ఆమెను వేధిస్తున్నాడు. డబ్బులు ఇవ్వాలని, అలాగే తనకు సహకరించాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో ఆమె తీవ్ర మనో వేదనకు గురైంది. దీనిని అవమానంగా భావించిన మహిళ శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.