మిడతల దండు నేపథ్యంలో అధికారులు అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర సరిహద్దులో హెలికాప్టర్లో ప్రత్యేకబృందం పర్యవేక్షిస్తుంది. అలాగే గోదావరి, ప్రాణహిత, పెన్ గంగా తీర గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫైరింజిన్లు, ట్యాంకర్లు, జెట్టింగ్ మిషన్లు, స్పేయింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాల్లో అధికారులు అప్రమత్తం చేశారు.