అది కోఠి దగ్గరున్న అబిడ్స్. మొన్ననే ప్రభుత్వం... రూల్స్ కొన్ని సడలించడంతో... ప్రజలు ఎక్కువగా రోడ్లపైకి వచ్చి... తమకు కావాల్సిన సామాన్లు కొనుక్కుంటున్నారు. అందువల్ల అబిడ్స్లో మెయిన్ రోడ్డు బిజీగా ఉన్నా... పక్కనున్న సందులు మాత్రం ఖాళీగానే ఉన్నాయి. ఇంతలో ఓ అమ్మాయి... చేతిలో మొబైల్ ఫోన్ను సుతారంగా పట్టుకొని... పక్క రాష్ట్రంలో ఉన్న తన ఫ్యామిలీ సభ్యులతో మాట్లాడుతూ రోడ్డు పక్కన వెళ్తోంది. దూరంగా ఓ బైక్. దానిపై ఇద్దరు వ్యక్తులు. గేర్ వేసి... స్పీడ్ పెంచారు. బైక్ క్రమంగా అమ్మాయికి దగ్గరగా వస్తోంది. ఆ సమయంలో... అక్కడ ట్రాఫిక్ జామ్ లేదు. ఇంతలో ఆమె చెవికి ఏదో తగిలినట్లు అనిపించింది. అదే సమయంలో... ఆమె చేతిలో మొబైల్ని బైక్పై వెనక కూర్చున్న వ్యక్తి లాగేశాడు. ఏం జరుగుతుందో గ్రహించేసరికే... అంతా అయిపోయింది. ఆమె హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంటే... అప్పటికే అబిడ్స్ పక్క సందులోంచీ ఆ మొబైల్ స్నాచర్లు పారిపోయారు.
పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్ చూశారు. బైకు, దానిపై ఇద్దరు మాస్క్ దుండగులు కనిపించారు. చోరీ చేసిన విధానం క్లియర్గా ఉంది. కానీ స్నాచర్లు ఎవరో తెలియట్లేదు. బైకుకి నంబర్ ప్లేటే లేదు. ముఖాలకు మాస్క్ ఉండటంతో... పోలీసులకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు.
Near Abids cell phone snatching was committed in which criminals used Bike without number plate . City police is launching special drive against improper number plates of all automobiles . Remember such improper number plates indicate that criminals may be using the Bike .
— Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) May 31, 2020