తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటైతే ఏ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించామో అవన్నీ పరిష్కారమయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి రంగంలో కూడా తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ముఖ్యంగా రైతాంగానికి అధిక లాభం జరిగిందన్నారు. విద్యుత్, సాగునీరు, విద్య, వైద్య, పారిశ్రామిక, ఐటీ తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని సీఎం కేసీఆర్ అన్నారు.