తెలంగాణలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరిగిపోతుంది. కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 మంది విద్యార్దులకు కరోనా సోకింది. కోఠి మెడికల్ కాలేజీలో 296 మంది విద్యార్దులున్నారు. ఇందులో 180 మంది విద్యార్ధినిలు,116 మంది విద్యార్దులున్నారు. వీరంతా హాస్టల్ లో ఉండి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. హైదరాబాద్ లో కరోనా కేసులు పెరగడంతో కాలేజీ ప్రిన్సిపాల్ అప్రమత్తమై విద్యార్దులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరి కొంత మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రస్తుతం విద్యార్దులంతా బాగానే ఉన్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ తెలిపారు.