ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలాంటి ఎన్నికలకు పనిచేయను : ప్రశాంత్‌కిషోర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 03, 2020, 08:57 AM

ముక్కలు ముక్కలుగా జరిగే ఇటువంటి ఎన్నికల కోసం తాను పనిచేయలేనంటూ కాంగ్రెస్‌ ఇచ్చిన ఆఫర్‌ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ తిరస్కరించారు. మధ్యప్రదేశ్‌లోని 24 అసెంబ్లీ స్థానాలకు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు రచిస్తున్నారన్న వార్తలను ఆయన ఖండించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు వెల్లడించారు. 'తనకు ప్రచార బాధ్యతలను అప్పగించాలని కమల్‌నాథ్‌తో పాటు పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కూడా భావించారు. వారు నన్ను సంప్రదించి రాబోయే ఎన్నికల్లో సహకరించాలని కోరారు. నేను అంగీకరించలేదు. ముక్కలు ముక్కలుగా జరిగే ఎన్నికల్లో నేను కాంగ్రెస్‌ కోసం పనిచేయలేనని స్పష్టంగా చెప్పాను'' అని ప్రశాంత్‌కిషోర్‌ పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్‌కు విధేయుడిగా ఉన్న జ్యోతిరాదిత్య సింథియా, తన వర్గం ఎమ్మెల్యేలతో పార్టీ నుండి వైదొలిగిడంతో.. ప్రస్తుతం ఆ సీట్లు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. 2014లో బిజెపితో పాటు ఎపిలో వైఎస్‌ఆర్‌ పార్టీని తన వ్యూహాలతో అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే 2014 ఎన్నికల అనంతరం అమిత్‌ షాతో విభేదాల కారణంగా ప్రశాంత్‌ కిషోర్‌ బిజెపికి దూరమయ్యారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌ తఅణమూల్‌ కాంగ్రెస్‌, తమిళనాడులో డిఎంకెతోనూ ఒప్పందం కుదుర్చుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com