పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లి చెందిన గంట సతీష్ అనే రైతు మంగళవారం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్ చల్ చేశాడు. తనకు ఉన్న 30 గుంటల భూమిని వేరొకరి పేరున పట్టా చేయడంతో మనస్తాపానికి గురైన సతీష్.. పెట్రోల్ డబ్బాతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్ చల్ చేశాడు. ఇది గమనించిన గ్రామస్తులు కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ సునీతకు సమాచారం అందించడంతో ఆమె సతీష్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో కిందికి దిగాడు. దీంతో బాధితుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.