భారత్లో వర్చువల్ మనీ వాలెట్స్కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని దేశీయ అతిపెద్ద ఫుడ్డెలివరీ సంస్థ స్విగ్గీ తాజాగా 'స్విగ్గీ మనీ' పేరుతో డిజిటల్ వాలెట్ను లాంచ్ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్తో కలిసి స్విగ్గీ మనీ పేరుతో వాలెట్ను తీసుకొచ్చింది. హోటల్, రెస్టారెంట్ల ఆర్డర్ల కోసం ప్రత్యేకంగా స్విగ్గీ మనీ రూపొందించింది. అమెజాన్ పే, పేటీఎం, ఫోన్పే తదితర డిజిటల్ వాలెట్లకు స్విగ్గీ మనీ గట్టిపోటీనిస్తుందని కంపెనీ భావిస్తున్నది. స్విగ్గీ యాప్ ఉన్న వినియోగదారులు ఫుడ్ ఆర్డర్ చేసే ముందు ఒక్కక్లిక్తో చెల్లింపులు చేయొచ్చు. ఇప్పటి నుంచి స్విగ్గీ కస్టమర్లు మనీ యాప్లో నగదు జమ చేసుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకొవచ్చు. స్విగ్గీ వినియోగదారులకు ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా ఉన్నట్లైతే వారు తక్షణమే వాలెట్ను ఉపయోగించుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలేని వారు కూడా ఏదైనా ప్రభుత్వ ఐడీకార్డు వివరాలను ఐసీఐసీఐ బ్యాంకుకు అందించడం ద్వారా వెంటనే వాలెట్ను వినియోగించుకునే వీలుంది. స్విగ్గీ మనీ ద్వారా యూజర్లు ఇన్స్టాంట్ రిఫండ్లను కూడా పొందవచ్చు.