తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజలకు శుభవార్త చెప్పారు. టీ ఫైబర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో మంగళవారం ఆయన ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీ ఫైబర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని,త్వరలోనే ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరముందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.