గాంధీ ఆసుపత్రిలో చికిత్స విషయంలో ప్రభుత్వం చెప్పేవి వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కరోనాను నివారించడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు ఆరోపించారు. కరోనా రోగులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించి వారికి మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు.