ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ డెయిరీ అభివృద్ధి కోసం సర్కారు కట్టుబడి ఉంది : తలసాని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 12, 2020, 10:18 AM

రాష్ట్రంలో విజయ తెలంగాణ డెయిరీ అభివృద్ధి కోసం సర్కారు కట్టుబడి ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్‌ స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు పాలు సరఫరా చేయడమే కాకుండా.. ఐసీడీఎస్‌ కేంద్రాలకు కావల్సిన 20 లక్షల లీటర్లు సరఫరా చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రస్తుతం ఐసీడీఎస్‌ కేంద్రాలకు అవసరమైన పాలల్లో 5.5 లక్షల లీటర్లు విజయ తెలంగాణ డెయిరీ సరఫరా చేస్తుంది. మిగతా లీటర్ల పాల సరఫరాకు అవసరమైన సిబ్బంది నియామకం ద్వారా పాల సేకరణకు కావలసిన సామర్థ్యం సమకూర్చుకుంటుందని మంత్రి తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com