కరోనా కట్టడిలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలు మన రాష్ట్రంలో చేసి.. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చి కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు.