ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 12, 2020, 10:22 AM

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఆదివారం ఉదయం తన సిబ్బందితో ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. కరోనా బాధితులకు వైద్యం ఎలా అందిస్తున్నారు.. వార్డుల్లో వసతులు ఎలా ఉన్నాయో నిశితంగా పరిశీలించారు. అనంతరం గాంధీ సూపరింటెండెంట్, ఆసుపత్రి సిబ్బందితో కిషన్ రెడ్డి మాట్లాడారు. కాగా గత రెండు మూడు రోజులుగా ఆయన కోవిడ్-19 బాధితులున్న ఆస్పత్రులను సందర్శిస్తున్నారు.   తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే పెరిగిపోతోంది. టెస్ట్‌లు సక్రమంగా చేయట్లేదని.. ఎక్కువ సంఖ్యలో కూడా చేయట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం టెస్ట్‌ల సంఖ్య పెంచాలని.. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని మీడియా ముందు వెల్లడించిన విషయం విదితమే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com