ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయం కూల్చివేతకు బ్రేక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 13, 2020, 04:03 PM

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు మళ్లీ బ్రేక్ పడింది. కూల్చివేత అంశం పై కొనసాగుతున్న స్టేను జూలై 15 వరకు హైకోర్టు పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టి ఈ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం కూల్చివేతకు సంబంధించి కేబినేట్ నిర్ణయాన్ని సీల్డ్ కవర్ లో అందజేయాలని న్యాయమూర్తిని ఏజీని ఆదేశించారు. సోమవారం సాయంత్రం వరకు సమర్పిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను జూలై 15 వరకు న్యాయమూర్తి వాయిదా వేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com