ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెన్త్‌ విద్యార్థులకు మరో అవకాశం.. గురుకుల కాలేజీల దరఖాస్తు గడువు పెంపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 13, 2020, 09:26 PM

తెలంగాణలోని గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే టెన్త్ విద్యార్థులకు మరో అవకాశం లభించింది. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్‌ కాలేజెస్‌ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TSRJC CET) 2020 పరీక్షకు దరఖాస్తు గడువును ఆగస్టు 5, 2020 వరకు పొడిగించారు.ఈ పరీక్ష ద్వారా గురుకుల కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం (ఇంగ్లిష్‌ మీడియం-ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ)లో ప్రవేశాలు పొందొచ్చు. ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 5వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత TREIS ఎంట్రెన్స్ టెస్ట్ తేదీని ప్రకటించనుంది.తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాల కోసం TSRJC CET 2020 జరగనుంది. మొత్తం 35 కాలేజీల్లో 20 బాలికల కాలేజీలు, 15 బాయ్స్ కాలేజీలు ఉన్నాయి. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను tsrjdc.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com