మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన బచ్చలకూర మాసయ్య (40) అనే రౌడీషీటర్ శనివారం రాత్రి 9 గంటల సమయంలో హత్యకు గురయ్యాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మాసయ్య గ్రామం నడిబొడ్డున ఉన్న దర్గా వద్ధ. ఆయన ఇంటికి సమీపంలోని దారి పక్కనే పడిపోయి అరుస్తుండడంతో ఇరుగుపొరుగువారు వెళ్లి పరిశీలించేసరికి అప్పటికే ప్రాణాలొదిడాడు. మెడభాగంపై కత్తి పోట్లున్నట్లు గుర్తించారు. జనసంచారం ఉండే ప్రదేశంలోనే హత్య జరగడం గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసింది. విషయం తెలుసుకున్న తిమ్మాజిపేట ఎస్సై శ్రీనివాస్ సంఘటనా స్థలానికి వెళ్లారు. హత్యకు పాతకక్షలే కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన ఓ హత్యకేసులో నిందితుడైన మాసయ్యపై రౌడీషీట్ ఉందని ఎస్సై తెలిపారు.