ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలోని కోవిడ్ వార్డు నుండి కరోనా బాధితులు 10 మంది పరారీ అయిన ఘటన కలకలం రేపింది. దీంతో అప్రపత్తమైన వైద్యశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పరారైన వారి కోసం గాలిస్తున్నారు. ఐతే 10 మందిలో నుండి ముగ్గురిని పోలీసులు గుర్తించారు. అందులో ఒకరిని టీచర్స్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ని రిమ్స్ కోవిడ్ వార్డ్ కు తరలించారు.