ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగ అరెస్టు.. బంగారు ఆభరణాలు స్వాధీనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 02, 2020, 09:00 AM

హైదరాబాద్ బాలానగర్ పరిధిలో బంగారు ఆభరణాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మహారాష్ట్రకు చెందిన రాహుల్​గా గుర్తించారు. జల్సాలకు అలవాటుపడిన వ్యక్తి.. కస్టమర్​గా ఆభరణాల దుకాణాలకు వెళ్లి బంగారు ఆభరణాలు చూపించమని కోరతాడు. అనంతరం వాటిని ధరించి పారిపోయాడు. సనత్​నగర్, మేడ్చల్ పీఎస్ పరిధిల్లో ఈ దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలానగర్ ఎస్​వోటీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 10 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com