తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్లో ముసలం మొదలైంది. కాంగ్రెస్ నేతలు దామోదర్రెడ్డి, అద్దంకి దయాకర్ మధ్య వర్గపోరు నడుస్తోంది. తనను దామోదర్రెడ్డి బెదిరిస్తున్నారని హైదరాబాద్లోని బేగంబజార్ పీఎస్లో అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్లో బడుగుబలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తనకు ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్ స్వయంగా పార్టీ టికెట్ ఇచ్చారని, అందరినీ తన చేతిలో పెట్టుకోవాలని.. దామోదర్రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. దామోదర్రెడ్డి టీఆర్ఎస్కు కోవర్టుగా పనిచేస్తున్నారని అద్దంకి దయాకర్ దుయ్యబట్టారు.