ఎన్ఎస్యూఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో నెలకొన్న విద్యా వ్యవస్థపై ప్రశ్నించే హక్కు వాళ్లకు ఉందన్నారు. అర్బన్, సెమి అర్బన్ పట్టణాల్లో స్కూళ్లు నడవడం లేదన్నారు. హైదరాబాద్లో ఆన్లైన్లో క్లాస్లు నడస్తున్నాయని, జూన్, జులై, ఆగస్టు నెలల్లో సిలబస్ లాస్ అయిన విద్యార్థుల పరిస్థితి ఏంటో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. 62 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భట్టి పేర్కొన్నారు.