కరోనా ప్రభావంతో తెలంగాణలో గణపయ్య ఉత్సవాలకు ఈ సారి అనుమతి లేనట్టేనని తెలుస్తోంది. ఖైరతాబాద్ గణేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ది. కానీ ఈ సారి ఖైరతాబాద్ గణేష్ ని చాలా చిన్నగా ప్రతిష్టిస్తున్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గణపయ్య మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతివ్వలేదు. గణేష్ మండపాలు ఏర్పాటు చేయడం వల్ల కరోనా వ్యాప్తి వేగంగా జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ఇటీవల భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీతో ప్రభుత్వ పెద్దలు,అధికారులు చర్చలు జరిపారు. కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.ప్రతి గ్రామంలో ఒకే వినాయకున్ని పెట్టి పూజలు జరుపుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చే యోచనలో ఉందని సమాచారం. ఇప్పటికే పలు జిల్లాల ఎస్పీలు మండపాలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించారు. అదే విధంగా బ్రాహ్మణ సంఘాల వారు కూడా వినాయకమండపాల్లో పూజలు చేయవద్దని నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం మాత్రం దీని పై అధికారిక ప్రకటన చేయలేదు. ఎస్పీలు,బ్రాహ్మణ సంఘాల వారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ సారి వినాయక ఉత్సవాలు లేనట్టేనని అర్దమైతుంది.