పాల ఉత్పత్తుల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన జెర్సీ బ్రాండ్.. గోద్రేజ్ జెర్సీగా మారింది. ఈ విషయాన్ని క్రీమ్లైన్ డెయిర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో రాజ్కన్వర్ మాట్లాడుతూ.. పోషక ప్రదాతగా గోద్రేజ్ జెర్సీని నిలిపేరీతిలో నూతన లోగోను ఆవిష్కరించడం జరిగిందన్నారు. చిరునవ్వుకు ప్రతిరూపంగా నిలిచే ఈ లోగోను విభిన్నమైన ఉత్పత్తులను ప్రమోట్చేసే విధంగా డిజైన్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలో జెర్సీ కంపెనీ తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నది.