ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటి శ్రావణి ఆత్మహత్య కేసుతో నాకు సంబంధం లేదు: అశోక్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 16, 2020, 08:39 PM

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. అనేక ట్విస్టుల మధ్య ఈ కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర నిర్మాత అశోక్‌ రెడ్డి తెలిపారు. తాను ఎవరితో ఫోన్‌లో మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. తానెప్పుడూ శ్రావణిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని అశోక్‌ రెడ్డి స్పష్టం చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పారు. కాగా శ్రావణి మృతి కేసులో ఏ 3 నిందితుడుగా ఉన్న ఆయన బుధవారం పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం అశోక్‌ రెడ్డిని వైద్య పరీక్షలు నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల ముగిసిన తర్వాత అశోక్‌ రెడ్డిని ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వార జడ్జి ముందు ప్రవేశపెట్టి...న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో ఇప్పటికే ఏ 1 దేవ్‌రాజ్‌ రెడ్డి, ఏ 2 సాయి కృష్ణారెడ్డి పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com