ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాకు ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 16, 2020, 08:52 PM

చైనాకు ఇండియన్ ఆర్మీ గట్టి హెచ్చరికలు చేసింది. యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా యుద్ధం చేయడానికి భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని.. అందుకు అనుగుణంగా తగిన శిక్షణ కూడా తీసుకున్నాయని ఇండియ‌న్‌ ఆర్మీ నార్తర్న్‌ కమాండ్‌ అధికార ప్రతినిధి బుధవారం (సెప్టెంబర్ 16) ఓ ప్రకటనలో పేర్కొన్నట్లు టీఓఐ తన కథనంలో వెల్లడించింది. శీతాకాలంలోనూ తూర్పు లడఖ్‌లో యుద్ధానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నామ‌ని స్పష్టం చేసినట్లు పేర్కొంది.ఒకవేళ చైనా యుద్ధం లాంటి పరిస్థితులను సృష్టిస్తే మాత్రం సుశిక్షితులైన, మానసికంగా దృఢంగా ఉన్న, సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆర్మీ నార్తన్ కమాండ్ కార్యాలయం హెచ్చరించింది. భారత్‌కు సరిపడినన్ని లాజిస్టిక్స్‌ అందుబాటులో లేవని.. శీతాకాలంలో యుద్ధం వస్తే సమర్థంగా ఎదుర్కోలేదని చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ రాసిన కథనానికి ఇండియన్ ఆర్మీ దీటుగా బదులిచ్చింది. ఆ రాతలు వారి అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొంది.శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండి కదన రంగంలో దూకే భారత బలగాలతో పోల్చితే పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) బ‌ల‌గాలు బలహీనమైనవని ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. చైనా జవాన్లు ఎక్కువగా పట్టణ ప్రాంతాలకు చెందిన‌వారని.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై అవగాహన, కష్టాలను ఎదుర్కోవడంలో సమర్థత వారి వల్ల కాదని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంపాటు మోహరించ‌డం చైనా బలగాల వల్ల కాద‌ని వ్యాఖ్యానించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com