జోగులాంబ గద్వాల : కృష్ణా నదికి వరద పెరిగింది. ఎగువ నుంచి, నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. ఇప్పటికే డ్యామ్ పూర్తిస్థాయిలో నీటితో నిండుకుంది. దీంతో వచ్చిన వరద కంటే ఎక్కువగానే దిగువకు వదులుతున్నారు. జలాశయానికి ప్రస్తుతం 1.88లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1,044 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు. డ్యామ్లో నీటి నిల్వ 9.111 టీఎంసీలు.. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. డ్యామ్ ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండుకోవడంతో 24 గేట్లు ఎత్తివేసి, 2,02,425 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.