రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ లోని క్రేషర్ క్వారీ నీటి గుంటలో పడి ఇద్దరు యువకులు గల్లంతై మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్ శివరాం పల్లికి చేందిన మల్లేష్ (24) జయకృష్ణ (25) మేస్తీ పని చేస్తూ ఉంటారు. పనికోసం కొత్వాల్ గూడ వచ్చిన ఇద్దరు యువకులు సీనరీ బాగుందని ఫోటోలు తీసుకుని కాళ్ళు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కాలుజారీ ఇద్దరు క్వారీ నీటి గుంటలో పడి గల్లంతు అయ్యి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్జీఐఏ పోలీసులు మృతదేహాల కోసం గాలించి మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.