ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలి: బిజెపి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 17, 2020, 06:32 PM

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ x రోడ్, బిజెపి కార్యాలయం వద్ద బిజెపి నాయకులతో కలసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పోరాటాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరత్వంతోడై నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడారన్నారు. భారత యూనియన్ లో విలీనమై స్వేచ్చా స్వాతంత్ర్యలను పొందిన సెప్టెంబర్17 తెలంగాణ ప్రజలకు ముమ్మాటికీ విమోచన దినమేనని అన్నారు.ఎంతో మంది బలిదానం, ఎన్నో ఉద్యమాలు,మరెన్నో పోరాటాలు వెరసి తెలంగాణా, దేశంలో 29వ రాష్ట్రం ఏర్పడింది అని అన్నారు.ఇది ముమ్మటీకీ తెలంగాణా ప్రజల గెలుపు.. కానీ తెలంగాణా ప్రజలు ఇంతకంటే వీరోచిత పోరాటం చేసిన ఘనత, సాదించిన విజయం "తెలంగాణా విమోచన దినం" అని అన్నారు. నర రూప రాక్షస జాతి నాటి రజాకారుల నుండి స్వేచ్ఛ ,స్వాతంత్ర్యం సాదించిన రోజును అదికారికంగా జరుపుకోలేక పోవడం బహుశా ప్రపంచంలోనే తెలంగాణా ప్రాంతం అయి ఉండవచ్చు అని అన్నారు.తెలంగాణా వచ్చి 6సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ అధికారముగా నిర్వహించక పోవడం ఏమనుకోవాలి అని అన్నారు.నాటి ప్రభుత్వములో ఉన్నది మంత్రులు మాత్రమే, వాళ్ళకి నాడు వర్తించిన మాటలను తన ప్రభుత్వానికి నేడు వర్తింప చేసుకుంటరా. ఒక ప్రక్క మహారాష్ట్రకు పోయి ఒప్పందాలు చేసుకొని వచిన సీఎం ఆ రాష్ట్రం జరుపుతున్న తెలంగాణ విమోచన దినం గురుంచి తెలుసుంటే బాగుంటుంది అని అన్నారు.మా నిజాం రాజు తరతరాల రుజువు అని చెప్పిన దాశరథి గొప్పవాడు అని, జల్, జంగల్, జమీన్ అని నినదించి నిజాంను వ్యతిరేకించిన కొమారం భీమ్ వీరధి వీరుడు,కలంతో జాతిని మేల్కోలిపిన షోయాబుల్లాఖాన్ గొప్ప త్యాగడనుడు అని జనాలకు చెపుతూ, మరోపక్క నిజాంకు, రజాకార్లకు వారసులిన ఒవైసీల సంతుస్తీకరణ కోసం తెలంగాణా ప్రజల స్వభీమానా దినం అధికారికముగా జరపకపోవడం నేటి ప్రభుత్వం దివాలా కోరుతనానికి నిదర్శనం కాదా అని అన్నారు. ఈ విమోచన దినం ఒక కులానికో, మతానికో సంబంధిచునది కాదని అని అన్నారు.మరో మారు మన ఆత్మ గౌరవం కోసం, మనం స్వేచ్ఛ స్వతంత్ర్య పొందిన మన తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17 అధికారముగా జరిపించాడినికి, నాడు నిజాం మెడలు వంచి తెలంగాణకు విముక్తి చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తి తో ఉద్యమిద్దాం అని అన్నారు.తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని జ్ఞానేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగుల్ గౌడ్, బిజెపి డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, మణిక్ రావు,నాయకులు కోటేశ్వరరావు, రవి గౌడ్,నర్సింగ్ రావు, జితేందర్,వర ప్రసాద్,పవన్, సురేష్, లక్ష్మణ్, ఉమాదేవి, చెందు, రత్నకుమార్, లక్ష్మణ్ గౌడ్, నాగరాజు, పాపయ్య, సుభద్ర, కల్పన,రఘు, సందీప్, అనిల్, రాజు,యాదగిరి, నర్సింహా,లక్ష్మారెడ్డి, నందు, రవి మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com