కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సవాల్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. నిన్న శాసనసభలో డబుల్ బెడ్ రూం ఇండ్లపై చర్చ సందర్భంగా ఇద్దరి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు గుర్తుకు వస్తాయని, నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎక్కడ కట్టారో తెలుపాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని అడిగారు. అందులో బాబాగంగా మంత్రి తలసాని గోశామహల్ నియోజకవర్గంలోని, గోడెకి కబర్, కట్టెల మండి లోని పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బట్టి విక్రమార్క, వి. హనుమంతరావు, విక్రమ్ గౌడ్ ని తీసుకువచ్చి, మేయర్ బొంతు రామ్మోహన్.టీఆరెస్ రాష్ట్ర నాయకులునంద్ కిషోర్ బిలాల్, కార్పొరేటర్స్ ముకేష్ సింగ్, పరమేశ్వరి సింగ్, మమతా సంతోస్ గుప్తాలతో కలసి చూపించారు. త్వరలో లబ్ధిదారులకు కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు.