తెలంగాణలో కొత్తగా మరో 2 వేల 043 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,67,046కు చేరాయి. ఇక నేడు 11 మంది మరణించారు..దీంతో మరణాల సంఖ్య 1016కి చేరాయి..కరోనా నుంచి మరో 1,802 మంది కోలుకున్నారు..మొత్తం రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,35,357గా ఉంది. కోలుకున్న వారి రేటు 81.02 శాతంగా ఉండగా, మరణాల రేటు 0.60గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 30 వేల 673 ఉండగా, నివాసాలు / సంస్థల ఐసోలేషన్ లో 24 వేల 081 మంది చికిత్స పొందుతున్నారు..ఇక గడిచిన 24 గంటలలో 50 వేల 634గా పరీక్షలు నిర్వహించారు..ఇప్పటి వరకూ తెలంగాణాలో 23 లక్షల 79 వేల 950 మందికి పరీక్షలు నిర్వహించారు..ఇక
సాధారణ పడకలు 12 వేల 284 అందుబాటులో ఉన్నాయని, 334 బెడ్స్ లో రోగులు ఉన్నారని, మొత్తం 11 వేల 950 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆక్సిజన్ పడకలు 05 వేల 561 అందుబాటులో ఉన్నాయని, 1, 391 బెడ్స్ లో రోగులు ఉన్నారని, మొత్తం 04 వేల 470 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. ఐసీయూ పడకలు 02 వేల 251 అందుబాటులో ఉన్నాయని, 739 బెడ్స్ లో రోగులు ఉన్నారని, మొత్తం 01 వేల 512 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు…
ఆదిలాబాద్ 19. భద్రాద్రి కొత్తగూడెం 49. జీహెచ్ఎంసీ 314. జగిత్యాల 42. జనగామ 25. జయశంకర్ భూపాలపల్లి 23. జోగులాంబ గద్వాల 17. కామారెడ్డి 31. కరీంనగర్ 114. ఖమ్మం 84. కొమరం భీం ఆసిఫాబాద్ 20. మహబూబ్ నగర్ 26. మహబూబాబాద్ 74. మంచిర్యాల 25. మెదక్ 25. మేడ్చల్ మల్కాజ్ గిరి 144. ములుగు 16. నాగర్ కర్నూలు 32. నల్గొండ 131. నారాయణపేట 12. నిర్మల్ 16. నిజామాబాద్ 65. పెద్దపల్లి 48. రాజన్న సిరిసిల్ల 46. రంగారెడ్డి 174. సంగారెడ్డి 71. సిద్దిపేట 121. సూర్యాపేట 51. వికారాబాద్ 20. వనపర్తి 22. వరంగల్ రూరల్ 33. వరంగల్ అర్బన్ 108. యాదాద్రి భువనగిరి 45.