పెద్దపల్లి: రాష్ట్రంలో తొలిసారిగా పేకాటరాయుళ్లపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదుచేశారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కమిషనరేట్ పరిధిలో ఈ కేసు నమోదయ్యింది. కమిషనరేటు పరిధిలోని చెన్నూరుకు చెందిన అన్నాల తిరుపతిపై రామగుండం సీపీ సత్యనారాయణ పీడీ యాక్ట్ నమోదు చేశారు. తిరుపతి ప్రతిరోజు పేకాటకు సంబంధించి అందర్, బాహర్ గేమింగ్ ఆడిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే అతడిపై కేసు నమోదుచేశామని వెల్లడించారు.