ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తగ్గిన బంగారం ధర

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 12:30 PM

బంగారం ధర దిగొచ్చింది. పసిడి వెలవెలబోయింది. బంగారం ధర పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగే అంశమని చెప్పొచ్చు. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి కూడా దిగొచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి పరుగుల పెట్టినా దేశీ మార్కెట్‌లో బంగారం ధర తగ్గడం గమనార్హం.


హైదరాబాద్ మార్కెట్‌లో గత రెండు రోజుల్లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.350 దిగొచ్చింది. అయితే ఈరోజు మాత్రం పసిడి ధర స్వల్పంగా పైకి కదిలింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,530కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,070కు చేరింది.


పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. గత రెండు రోజుల్లో కేజీ వెండి ధర రూ.660 పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు వెండి ధర జిగేల్‌మంది. దీంతో వెండి ధర రూ.68,300కు చేరింది.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.14 శాతం పెరుగుదలతో 1966 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.42 శాతం పెరుగుదలతో 27.46 డాలర్లకు ఎగసింది.


ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com