గౌరవ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ గారి ఆదేశాలు, సూచనల మేరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు నియోజకవర్గ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులతో గండిమైసమ్మలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ ఆయా స్థానిక ప్రాంతాల్లో పర్యటించి ఓటరు నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో చేపట్టాలన్నారు. గౌరవ మంత్రి కేటీఆర్ గారి ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని డిగ్రీ పూర్తి చేసిన వారిని చైతన్య పరుస్తూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అలాగే అధిష్టానం బలపర్చిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఘన విజయంతో గెలిపించేలా సమిష్టి కృషి అవసరమన్నారు. ప్రణాళికబద్ధంగా ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ స్థానికంగా పార్టీని మరింతబలోపేతం చేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి నమ్మకం ఉందని, వారి ఆశీర్వాదం తప్పక ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.