మేడ్చల్, మల్కాగ్జిరి జిల్లాలో పదేళ్ల బాలిక అదృశ్యమైంది. నిన్న సాయత్రం సైకిల్ తీసుకుని బయటకు వెళ్లిన సుమేధా కాపూరియా మళ్లీ ఇంటికి రాలేదు. నెరేడ్మెట్ నాలా వద్ద బాలిక కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. బాలిక సైకిల్ను నాలా వద్ద గుర్తించారు.
సుమేధా కాపూరియా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమీపంలోని సీపీ కెమెరాల పుటేజీలను పరిశీలించినప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు. ఆమె కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.