తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో 967 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు ఉండేవని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం విజయవంతంగా అమలు చేయడంతో రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు సున్నాకు చేరుకున్నాయన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్ సాక్షిగా దృవీకరించిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.