ముఖ్యమంత్రి కెసిఆర్ అధికార నివాసం ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ కిసాన్ సెల్ యత్నించింది. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. కాగా ముట్టడిలో పాల్గొనేందుకు కారు దిగిన సమయంలో తనపై చేయవేసిన మహిళా పోలీస్ను సీతక్క హెచ్చరించారు. చేయిఎందుకు వేస్తారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎమ్మెల్యే సీతక్క మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, రైతుల గురించి అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించలేదని, భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని సీతక్క డిమాండ్ చేశారు. సభలో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె మండిపడ్దారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు.