ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్కాజిగిరి లో యువతి అదృశ్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 18, 2020, 06:24 PM

యువతి అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ నవీన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మౌలాలి మహాత్మా గాంధీ నగర్ కి చెందిన పోశయ్య కూతురు నవనీత డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ నెల 16వ తేదీ రాత్రి టీవీ చూస్తున్న నవనీత ను తల్లి చంద్రకళ ఇంటి పనిలో సాయం చేయమని కోరింది. తల్లి అడిగినందుకు మనస్తాపం చెందిన నవనీత తన గదిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం తల్లి నిద్ర లేచి చూసేసరికి కుమార్తె కనిపించలేదు. చుక్కుప్రక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబీకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కేసు విచారణలో ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com