గ్రేటర్ పరిధిలోని అన్ని వీధులు, రహదారుల్లో దీపాలు వెలగాలని మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశించారు. వెలగని చోట మరమ్మతులు చేయడంతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద హైవోల్టేజి దీపాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వీధి దీపాల మరమ్మతులతో పాటు, కూడళ్ల వద్ద 110 వాట్ల దీపాల్ని అక్టోబరు మొదటి వారంలోపు పూర్తి చేయాలని వారు ఆదేశించారు.