గత ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నాయని టిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏ ఒక్క కుల సంఘానికి గాని ఒక్క గజం భూమిని కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరంలో ఎంతో విలువైన ప్రాంతాలైన పుప్పాలగూడ, ఉప్పల్ బాగాయత్లలో బీసీ కులాలకు 80 ఎకరాల్లో వేల కోట్ల రూపాయల విలువైన భూములను కేటాయించారని మంత్రి స్పష్టం చేశారు.