కేంద్రం ప్రవేశపెట్టిన రైతు బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ తన పదవికి రాజీనామా చేయడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ బిల్లుతో రైతులను దెబ్బకొట్టే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులకు నష్టం చేకూర్చే బిల్లుకు టీడీపీ, వైసీపీ ఎట్లా మద్దతు పలికాయో అర్థంకావడం లేదన్నారు. దుర్మార్గమైన బిల్లుకు మద్దతు తెలిపే వాళ్లు దుర్మార్గులే అని ఆయన విమర్శించారు.