డబుల్ ఇళ్ల నిర్మాణాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య తీవ్ర వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఎన్ని నిర్మించారో చెప్పాలని అసెంబ్లీలో భట్టి అడిగిన ప్రశ్నకు మంత్రి తలసాని గురువారం స్వయంగా భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం మిగిలినవి శుక్రవారం కూడా పరిశీలిస్తానని ఇరువురు నేతలు అన్నారు. కానీ సడన్గా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పర్యటనకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇళ్లు చూపించమంటే పక్క నియోజకవర్గాల్లో ఇళ్లు చూపిస్తున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసి కొల్లూరుకు రావాలంటూ తలసాని వెళ్లిపోయారు. కాగా దీనిపై మళ్లీ ఎవరు ఎలా స్పందిస్తారో.. లేదా మళ్లీ డబుల్ ఇళ్ల పరిశీలనకు వెళ్తారో లేదో వేచి చూడాలి.